ఈ నెల 23న వాటర్షెడ్ యాత్ర
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:42 PM
ప్రధాన మం త్రి కృషి సంచాయ్ యోజన పథకంలో భాగంగా ఈ నెల 23న జిల్లాలోని అచ్చంపేట నియోజ వ ర్గంలోని అమ్రాబాద్, ఉప్పునుంతల, బీకే.లక్ష్మా పూర్ గ్రామాల్లో వాటర్ షెడ్ యాత్ర నిర్వహిం చనున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహా యం తెలిపారు

- అదనపు కలెక్టర్ దేవసహాయం
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మం త్రి కృషి సంచాయ్ యోజన పథకంలో భాగంగా ఈ నెల 23న జిల్లాలోని అచ్చంపేట నియోజ వ ర్గంలోని అమ్రాబాద్, ఉప్పునుంతల, బీకే.లక్ష్మా పూర్ గ్రామాల్లో వాటర్ షెడ్ యాత్ర నిర్వహిం చనున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహా యం తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వాటర్షెడ్ యాత్రపై సంబం ధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ వాట ర్ షెడ్ యాత్రకు స్థానిక ఎమ్మె ల్యే, ఎంపీలతో పాటు జిల్లా కలె క్టర్ పాల్గొననున్నారని పేర్కొ న్నారు. వాటర్షెడ్ యాత్రపై సంబంధిత అధికారులు ప్రజ ల్లో విస్తృతంగా అవగాహన కల్పించి సంబంధిత అధికారు లను ఆదేశిం చారు. వాటర్షెడ్ యాత్రలో భా గంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో చిన్నఓబులేష్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, డీపీవో రామ్మోహన్రావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి జగన్ పాల్గొన్నారు.