Secundrabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..

ABN, Publish Date - Mar 13 , 2025 | 11:04 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.

Secundrabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..

- తల్లీబిడ్డ క్షేమం..‘గాంధీ’కి తరలించిన ఆర్పీఎఫ్‌ పోలీసులు

సికింద్రాబాద్‌: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secundrabad Railway Station)లోనే ఆడశిశువువుకు జన్మనిచ్చింది. దుండిగల్‌కు చెందిన తబ్బామాజి గర్భవతి. విశాఖపట్నం(Vishakapatnam) వెళ్లేందుకు భర్తతో కలిసి బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం నంబర్‌ 6కి చేరుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం


city7.jpg

ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎండీ మహేష్‏(RPF SI Mahesh)తోపాటు మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం కోసం సపర్యలు చేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం తల్లీబిడ్డను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారని ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 11:04 AM