CM Chandrababu: అంబేడ్కర్కు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 14 , 2025 | 01:21 PM
గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. జిల్లాలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణం వద్దకు చంద్రబాబు చేరుకున్నారు.
గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. జిల్లాలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. పీ4 కార్యక్రమాల లబ్ధిదారులతో సీఎం సమావేశం అయ్యారు. మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా
Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..
TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!
Read Latest AP News And Telugu News
Updated at - Apr 14 , 2025 | 01:31 PM