సుప్రీంకు బాంబ్ బ్లాస్ట్ దోషులు

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:14 PM

Dilsukhnagar blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ బ్లాస్ట్‌ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్నారు దోషులు.

హైదరాబాద్, ఏప్రిల్ 8: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ( Dilsukhnagar blast Case) దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana Court) సంచలన తీర్పును ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేస్తామని నిందితుల తరుపు న్యాయవాదులు తెలిపారు. నెల రోజుల్లో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరుపు న్యాయవాదులు వెల్లడించారు. ఇప్పటికే ట్రయల్ కోర్ట్ విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన తీర్పును హైకోర్టులో దోషులు సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తిస్తూ.. వారికి తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది.


ఇవి కూడా చదవండి

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 08 , 2025 | 12:17 PM