Home » ACB
Telangana: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఈరోజు (శుక్రవారం) ఏసీబీ విచారణను ప్రారంభించింది. హెచ్ఎండీ, ఆర్థికశాఖకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ తెప్పించుకుని విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఎమ్ఈయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ను ఏసీబీ తీసుకోనుంది.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారాల్లో అసలు అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఏ1గా పేర్కొంది.
ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్ శాంతి కుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.
నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీ చిక్కిన నిఖేష్ కుమార్.. రోజుకు రూ. 2 లక్షలకుపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నిఖేష్ కుమార్తోపాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17 కోట్ల 73 లక్షల అక్రమాస్తులు వెలుగుచూశాయి.
ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్ అకౌంటెంట్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రవాణా శాఖ చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని మూడు వేర్వేరు చెక్పోస్టులపై ఏసీబీ ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
సస్పెండ్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు సోదాలు చేస్తు్న్న సమయంలో నికేష్ ఇంట్లో హైడ్రామా నడిచింది. ఏసీబీ అధికారులను గమనించిన ఏఈఈ దస్త్రాలను మూటగట్టి బాల్కానీలో నుంచి బయటకు విసిరేసారు.