Home » Adilabad
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది.
సీపీఐ వందేళ్ళ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజలు, కార్మికులు, రైతుల సమ స్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.
క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్ బేస్బాల్ చాంపియన్ షిప్ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
నస్పూర్లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు.
నాణ్యమైన ధాన్యం కొను గోలు కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్డీఏ డీపీఎం వేణుగోపాల్ సూచించారు. నెల్కివెంకటాపూర్, మదాపూర్, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్ గ్రామాల్లో గురువారం కేంద్రాలను సందర్శిం చారు.
సన్నరకం ధాన్యం పక్కదారి పడుతోంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు బోనస్ ప్రకటించినా రైతులు ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారు. తేమ శాతంతోపాటు వారు సూచించిన విధంగా బియ్యం గింజ పొడవు, మందం ఉంటేనే సన్నరకంగా పరిగణిస్తున్నారు. రైతులు గ్రామాలకు వచ్చిన వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీంతో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఆచరణ సాధ్యమయ్యేలా అగుపించడం లేదు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నస్పూర్లోని ఎంఎల్ఎస్ పాయింట్ ఎదుట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్చార్జి శంకర్కు వినతిపత్రం అందించారు.
దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు.
మండలంలోని నర్సింగాపూర్ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు.