Home » Delhi liquor scam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిహాడ్ జైలులో కవితతో హరీశ్ రావు ములాఖత్ అయ్యారు.
National: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరుపనుంది. లిక్కర్ కేసులో ఐదు నెలలుగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
MLC Kavitha Health Issues: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు తీహార్ జైలు అధికారులు. కాసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.
మద్యం విధానం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను లిస్టింగ్ చేయడాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీం మంజూరు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.