Home » DGP Jitender
నల్గొండ జిల్లాలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లు కుంభకోణంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ జితేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీశ్రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకంగా మారిందని డీజీపీ డా. జితేందర్ అన్నారు. సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
Telangana: బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.
నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రూ.84.3 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..
తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర ఐదో డీజీపీగా బాధ్యతలను చేపట్టాక.. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతల్లో ఉన్న జితేందర్కు ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది.