Home » Election Commission of India
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా దేశానికి సేవ చేయాలని, ఎవరిపట్లా దుర్బుద్ధితో వ్యవహరించకూడదని కోరారు
కేంద్ర మంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక..
లోక్సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) కలిశాయి. మంగళవారం కౌంటింగ్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగాకే.. ఈవీఎంలను తెరవాలని ఇండియా కూటమి కోరింది.
దాదాపు 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లు చేసి బెదిరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఏ ఒక్క కలెక్టరు నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.