Home » Kamareddy
కొలువు కోసం సౌదీకొచ్చిన తెలంగాణ వాసి మూడు రోజులకే మృత్యువాతపడ్డాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా అతడు పారిపోయాడంటూ కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం స్వదేశంలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది.
బీసీలకు రాజ్యాధికార కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను ఎన్నికల్లో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేక ఓ రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులో శనివారం జరిగిన ఈ ఘటనలో తెడ్డు ప్రశాంత్(28) అనే యువకుడు బలవన్మరణం పొందాడు.
ఆ ఇద్దరు వైద్యులు తండ్రీకొడుకులు! చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో అనేది సంబంధీకులకు చెప్పేస్తారు. పైగా.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు.
సంగారెడ్డి: తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.