Home » Karimnagar
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గురువారం గోదా వరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు తోనే రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందు తుందని రామ గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం బ్రాహ్మణపల్లి శివా రు పంప్హౌజ్ వద్ద జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రా లకు వస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేస్తూ వెంట వెంటనే రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ వ్యవ సాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండలంలోని 8 గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షం రైతులకు భారీ నష్టం వాటిల్లిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దెబ్బతిన్న పంటలను పరి శీలించారు.
వరంగల్ ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సం దర్భంగా గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడా లని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంథని నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధు పిలుపునిచ్చారు. బుధ వారం ఆయన నివాసంలో డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లోని బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలతో సన్నాహాక సమావేశాన్ని నిర్వ హించి సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు.
కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్టీయుసీ బూమల్ల చందర్, ఐఎఫ్టీయు నాయకులు కె. విశ్వ నాథ్, సిహెచ్ శంకర్, వైకుంఠం మాట్లాడారు.
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఏజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.