Home » Mahabubabad
కాంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు.. వట్టి చేపలు తిని బతికానని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మున్సిఫ్ ప్రకాశ్ చెప్పాడు. చేసిన పనికి డబ్బులివ్వకపోగా తానే బాకీ పడ్డానంటూ కంపెనీ తనపై కేసుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్ ప్రకాశ్కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.
స్నేహితుల పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పార్టీలో భాగంగా కల్లు తెప్పించగా దాన్ని తాగిన ముగ్గురు యువకులూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.
శ్రీరాములు అలియాస్ శ్రీను అని పిలువబడె ఎస్ఐ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు .
విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.
హైదరాబాద్(Hyderabad) నడిగడ్డతండా(Nadigadda Tanda)లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు.
మహబూబాబాద్: బయ్యారంలో దారుణం జరిగింది. ఓ కిరాణా వ్యాపారి 10 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు అరవింద్, జమున, దీపిక మహబూబాబాద్ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం లేఖ రాశారు.
పెళ్లయి.. కుటుంబాలతో ఉంటున్న ఇద్దరు మహిళలు.. ఇంటి నుంచి వెళ్లిపోయి సహజీవనం చేస్తుండటం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ గ్రామంలో చర్చనీయాంశమైంది.