Home » Manipur
మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోటపై నుంచి ఆయన మాట్లాడారు.
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
మణిపూర్లో భరతమాతను హత్య చేశారని కేంద్రంలోని అధికార బీజేపీని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నెలలు తరబడి మణిపూర్ మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ, జోక్లు విసరడాన్ని తప్పుపట్టారు.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..
ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు (బుధవారం) చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనన్నారు..
మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్కు కుకీ పీపుల్స్ అలయెన్స్ షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది.
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.
మణిపూర్లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.