Home » Manipur
మణిపూర్(Manipur) హింసాకాండపై ప్రధాని మోదీ(PM MODI) ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు(Opposition parties) పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు.
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని..
మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
రెండు నెలలకు పైగా హింసాకాండతో విలవిల్లాడుతున్న మణిపూర్లో త్వరలోనే యథాపూర్వ పరిస్థితిలు నెలకొంటాయని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తెలిపారు. సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్ను తోసిపుచ్చారు. మణిపూర్ ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్ 267పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.