Home » NRI News
రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్సైట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా..
సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై జరిగిన అంతర్జాల సాహిత్య చర్చా కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Canada Govt Key Decision : కెనడాలో శాశ్వత నివాసం ఉండాలను కోనే విదేశీయులకు గట్టి షాక్ తగిలింది. ఏదో జాబ్ చూసుకుని హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామనుకొంటే కుదరదని వీదేశీయులకు కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకొనే జాబ్ ఆఫర్ పాయింట్లను సైతం ఎత్తివేసింది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.
ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22- 23 తేదీల్లో నిర్వహించిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించి, మధ్య ప్రాచ్య దేశాల్లో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది.
టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..
తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్లోనూ వ్యాపించాయి.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ నెల చివరి ఆదివారం మన భాష- మన యాస మాండలిక భాషా అస్తిత్వంపై..