Home » Peddapalli
BJP: బీజేపీ నేతల సమావేశంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. తన ఫోటోను ఫ్లెక్సీలో ఎందుకు వేయలేదంటూ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నేత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మాదిరిగా పాత ఇళ్ల పేరిట బిల్లులు తీసుకోవడం, ఇళ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్ చేయాలని నిర్ణయించింది. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభు త్వం జియో ఫెన్సింగ్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీని కోసం కృతిమ మేధ (ఏఐ) సాయంతో ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేశారు. ఇంది రమ్మ ఇళ్లతో దీన్ని అమల్లోకి తేనున్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం సుల్తానాబాద్లో విఫలమైంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరగడం లేదు. ఇంటింటికి బిగించిన భగీరథ నల్లాల ద్వారా చుక్కనీరు రావడం లేదు.
రామ గుండంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్డీఎఫ్ నిధు లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. గురువారం కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం కమిషరేట్ టాస్క్ఫోర్స్ బృందాలు గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పకడ్బందీ సమాచారంతో ఒకే రోజు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాడులు నిర్వహించి 1.2 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 15 మంది నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు, ఐదు మోటార్ సైకిళ్లు, 17సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకున్నది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మంథనిలో పలు ప్రభుత్వ శాఖలకు ఏళ్ళ తరబడి సొంత భవనాలు లేకుండా పోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల నిర్వాహణను మంథనిలోని ఇతర ప్రభుత్వ శాఖల ఆఫీసుల్లో, పలు గెస్ట్ హాజ్ల్లో, అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతీ విద్యా ర్థికి కనీస విద్యా ప్రమాణాలు మెరుగు పర్చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచిం చారు. రామగిరి మండలంలోని బుధవారం పేట్, పన్నూరు, రత్నాపూర్, బేగంపేట్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు శివాజీ మహరాజ్ అని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. శివాజీ జయంతి సంద ర్భంగా బుధవారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో మాట్లాడారు.
జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి సోలార్ వెలుగులు ఏర్పాటు చేశారు. సుమారు 75 లక్షల రూపాయల వ్యయంతో 200 కేవీఏ (160 కిలో వాట్స్) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. నెల రోజుల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సోలార్ పవర్ గ్రిడ్కు అనుసంధానం చేశారు.