Home » Prakasam
ప్రకాశం జిల్లా: టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్ సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.
నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో...
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.