Home » Secundrabad
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మాల్దా టౌన్కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం(యూటీఎస్) యాప్ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) ఎదురుగా ఉన్న హోటల్లో బాంబు పెట్టానని, కాసేపట్లో పేలుతుందని పోలీస్ కంట్రోల్ రూమ్(Police control room)కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. పోలీసులు హోటల్లో విస్తృత తనిఖీ చేసి బాంబు లేదని గోపాలపురం పోలీసులు నిర్ధారించారు.
బీదర్ వయా సికింద్రాబాద్గా నిజాముద్దీన్కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు.
కుంభమేళా జరిగే ప్రదేశాలకు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలో 140 ప్రత్యేకరైళ్లు నడిపామని అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా రైళ్లలో సుమారు 1.30లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్న గయా, దానాపూర్, పాట్నా, ఆజంఘడ్, ప్రయాగరాజ్, రక్సాల్, బనారస్, గోమతినగర్(లక్నో) ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లివచ్చారని తెలిపారు.