Home » T20 WC 2024
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడింది.
ఇటివల టీ20 ప్రపంచకప్ 2024(t20 world cup 2024) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రోహిత్ స్థానంలో టీ20 ఇంటర్నేషనల్లో ఏ ఆటగాడు భారత జట్టు బాధ్యతలు చేపడతాడనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్పై ఎవరి అంచనాలు వారివి.
టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024) రెండో సెమీఫైనల్లో భారత జట్టు(team india) గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్పై(England) 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది.
టీ20 ప్రపంచకప్ 2024 చాంఫియన్గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో ఆప్ఘాన్పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్కు చేరుకోగా.. సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.