Home » Vinesh Phogat
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు.
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్(Vinesh Phogat) రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లర్ పోటీల్లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సోమవారం అస్వస్థతకు గురైంది. స్వగ్రామమైన బలాలీకి చేరుకున్న అనంతరం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువుందనే కారణంతో ఒలింపిక్(Paris Olympics 2024) రెజ్లింగ్ పోటీల్లోంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)ని తొలగించిన విషయం తెలిసిందే.
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీ(delhi) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె చాలా ఏడ్చింది. ఈ క్రమంలో వినేష్కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు.
పారిస్ ఒలింపిక్స్ 2024(Olympics 2024)లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్కు వెళ్లకముందే అనర్హత వేటుకి గురైన వినేశ్ ఫొగట్కి మరో షాక్ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తోసిపుచ్చింది.
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) వాయిదా వేసింది. ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.
పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఎదురైన పరిస్థితి చాలా మందికి మేలుకొలుపుగా మారింది. కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ పతకం సాధించే అవకాశం కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులకు ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు మేనేజ్మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.