Ap High Court: R-5 జోన్ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు

ABN , First Publish Date - 2022-11-10T18:08:32+05:30 IST

R-5 జోన్ నోటిఫికేషన్‌పై రైతులు ఏపీ హైకోర్టును (Ap High Court) ఆశ్రయించారు. R-5 జోన్ ఏర్పాటుపై రేపు మ.12 గంటల లోపు గ్రామ సభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Ap High Court: R-5 జోన్ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు

అమరావతి: R-5 జోన్ నోటిఫికేషన్‌పై రైతులు ఏపీ హైకోర్టును (Ap High Court) ఆశ్రయించారు. R-5 జోన్ ఏర్పాటుపై రేపు మ.12 గంటల లోపు గ్రామ సభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. R-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి సీఆర్డీఏ ప్రతిపాదనను ప్రత్యేక అధికారి ఆమోదించారని న్యాయవాదులు పేర్కొన్నారు. అలాగే రైతులకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సభ నిర్వహించకుండా అభిప్రాయాలు తీసుకోవడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. దీంతో గ్రామ సభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-11-10T18:09:22+05:30 IST