AP News: టీడీపీలో చేరికలు... ఆహ్వానించిన బొరగం

ABN , First Publish Date - 2022-11-17T15:16:17+05:30 IST

జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

AP News: టీడీపీలో చేరికలు... ఆహ్వానించిన బొరగం

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకున్నారు. దొరమామిడి పంచాయతీ, చిన్నజిడిపూడి, పెద్దజిడిపూడి, దొరమామిడి డ్యాం కాలనీకి చెందినవారికి నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ.. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తానని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. టీడీపీ గెలిచిన వెంటనే గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యే దిశగా అందరూ కష్టపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, యుకెడి బాబు, కారంపూడి ఆదినారాయణ, పఠాన్ రసూల్ ఖాన్, కోమిటీ పద్మరాజు, అలిషా, భాషా, దువ్వేల సంకురుడు, మాజీ ఎంపిటిసి సొదెం దుర్గారావు, మడకం నాగేశ్వరరావు, సోదేం మల్లయ్య, కరకాల తమ్మిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలుతదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T15:24:16+05:30 IST