AP DGP: సెలవులో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి

ABN , First Publish Date - 2023-05-20T10:49:10+05:30 IST

డీజీపీ రాజేంద్రనాథరెడ్డి (Rajendranath Reddy) సెలవులో వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనలో ఉన్నారు.

AP DGP: సెలవులో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి

అమరావతి: డీజీపీ రాజేంద్రనాథరెడ్డి (Rajendranath Reddy) సెలవులో వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనకు ఈ నెల 18 నుంచి జూన్ 3 వరకూ 16 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులు (ఈఎల్) మంజూరు చేసింది. రాజేంద్రనాథరెడ్డి వచ్చే వరకు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ (Shankha Brata Bagchi)కి ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఇన్‌ఛార్జీ డీజీపీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రాజేంద్రనాథ్‌రెడ్డి తిరిగి వచ్చాక యథాస్థానంలో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2023-05-20T10:51:58+05:30 IST