తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
ABN , First Publish Date - 2023-08-29T23:49:23+05:30 IST
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని ఎస్పీ అన్బురాజన్ అన్నారు.

ఎస్పీ అన్బురాజన్
కడప (క్రైం), ఆగస్టు 29: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో మంగళవారం గిడుగు జయంతి నిర్వహించారు. రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి బహుభా షా శాస్త్రవేత, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎ స్పీ కృష్ణారావు, ఆర్ఐలు వీరే్ష, సోమశేఖర్ నాయక్, శ్రీశైల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.