వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జిల్లా ఆస్పత్రి సందర్శన
ABN , First Publish Date - 2023-04-03T00:59:59+05:30 IST
స్థానిక జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రామిరెడ్డి ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడున్న సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. అలాగే రోజువారీ ఓపీ, రిఫరల్ కేసులు, ప్రసూతి సేవలను అడిగి తెలుసుకున్నారు.

- రోగులకు వైద్య సేవలందుతున్న తీరుపై ఆరా
పాడేరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రామిరెడ్డి ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడున్న సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. అలాగే రోజువారీ ఓపీ, రిఫరల్ కేసులు, ప్రసూతి సేవలను అడిగి తెలుసుకున్నారు. సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా పరీక్షల నిర్వహణకు జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్ను ఆయన పరిశీలించారు. వార్డులు, ప్రసూతి విభాగం, పోషకాహార పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది స్థితిగతులు, ఇతర సదుపాయాలపై హెల్త్ డైరెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, జిల్లా మలేరియా అధికారి సాంబమూర్తి, జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త శంకర్ప్రసాద్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.