వైరాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు
ABN , First Publish Date - 2023-08-08T23:13:06+05:30 IST
వైరా నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరయింది. ఈమేరకు ఎమ్మెల్యే రాములు నాయక్కు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈవిషయాన్ని వెల్లడించారు.

వైరా, ఆగస్టు 8: వైరా నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరయింది. ఈమేరకు ఎమ్మెల్యే రాములు నాయక్కు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈవిషయాన్ని వెల్లడించారు. మంగళవారం నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను వినతిపత్రం రూపంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కూడా ఒకటి. వైరాలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, దీనివల్ల వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పం దించిన ముఖ్యమంత్రి వైరాకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిం చారు. దీంతో ఎమ్మెల్యే రాములు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఎ మ్మెల్యే వెంట ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మఽధు ఉన్నారు. డిగ్రీ కళాశాల మంజూరు పట్ల ఆయన కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.