Share News

Hyderabad: ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత

ABN , First Publish Date - 2023-12-07T11:00:58+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.

Hyderabad: ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున​ఖర్గేతో పాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద మూడు వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల, బయట మెటల్​ డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తారు. స్టేడియంపరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఇన్​ఛార్జ్​ డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ ​పోలీస్​కమిషనర్​ సందీప్​ శాండిల్య నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం చుట్టూ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద మెటల్ డిటెక్టర్లను నియమించారు.

Updated Date - 2023-12-07T11:02:11+05:30 IST