Share News

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

ABN , First Publish Date - 2023-10-31T09:22:08+05:30 IST

సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam ) సవాల్ చేశారు.

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

ఢిల్లీ: సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam) సవాల్ చేశారు. గతంలో ఓ కంపెనీపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల శిక్షను సంగారెడ్డి కోర్టు విధించింది. సంగారెడ్డి కోర్టు తీర్పు పై హైకోర్టుకు మహిపాల్‌రెడ్డి వెళ్లారు. సంగారెడ్డి కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును అడ్వకేట్ ముఖిం ఆశ్రయించారు. మహిపాల్‌రెడ్డి కేసు విచారణను జస్టిస్ ఎం ఎం సుందరేష్ , జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం చేపట్టనున్నది.

Updated Date - 2023-10-31T09:35:38+05:30 IST