ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి భారీ షాక్

ABN, Publish Date - Aug 11 , 2024 | 02:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలింది. కచ్చితంగా గెలిచేస్తాం.. గెలిచి తీరుతాం అని ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీకి గట్టి దెబ్బే పడింది..! అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచ్‌లు వైసీపీకి షాకిచ్చారు. మునగపాక మండలం ఎంపీపీ మళ్ళ జయలక్ష్మి వైసీపీకి గుబ్ బై చెప్పేసి జనసేనలో (Janasena) చేరారు. వైస్ ఎంపీపీలు బోద లక్ష్మి, చిందాడ దేవిలు కూడా పార్టీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. మరోవైపు.. రాజుపేట సర్పంచ్ కెల్లాడిదేముళ్ళు, చెర్లోపాలెం గ్రామ ఉపసర్పంచ్ బోదా వెంకట శ్రీనివాసరావులు సైతం వైసీపీని వద్దనుకుని జనసేనలో చేరిపోయారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలనలో ఇన్నాళ్లు ఉన్నందుకు సిగ్గు పడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు మీడియాకు వెల్లడించారు.


గెలుస్తాం.. గెలిచి తీరుతాం..!

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే.. ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశం జరిగింది. నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాలో పార్టీల బలాబలాలపై చంద్రబాబునాయుడు చర్చించారు. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే ఊపుతో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకుంటామని కొందరు నాయకులు బాబుకు వివరించారు. అభ్యర్థి ఎవరైనా గెలుస్తామని మరికొందరు పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలామంది సభ్యులు కూటమికి మద్దతు తెలిపారని వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వైసీపీ ఉత్తర భారతదేశ యాత్రకు తీసుకువెళ్లిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వైసీపీతో పోల్చితే కూటమికి తక్కువ ఓట్లు ఉన్నాయని పేర్కొంటూ పోటీకి దూరంగా ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నేతలంతా మరోసారి కూర్చుని పోటీ/అభ్యర్థిపై తేల్చాలని అధినేత సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


అభ్యర్థి ఎవరు..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, మాడుగుల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, బత్తుల తాతయ్యబాబు సిద్ధంగా ఉన్నారు. ఇంకా బైరా దిలీప్‌ చక్రవర్తి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రసవత్తరంగానే సాగేలానే కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది సోమవారం నాడు ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్సీ అభ్యర్థినీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కార్పొరేటర్ల ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా బొత్స సత్యనారాయణ కార్పొరేటర్లను విహార యాత్రలకు తిప్పుతున్నారని.. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని వంశీ చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 11 , 2024 | 04:13 PM

Advertising
Advertising
<