ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Seshagiri Rao: పిన్నెల్లిని అరెస్ట్ చేయాల్సిందే: సుప్రీంను ఆశ్రయించిన నంబూరి

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:47 PM

న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే (Macharla MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ (Arrest) చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు (Namburi Seshagiri Rao) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు (High Court) ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ (Polling) రోజు ఈవీఎం (EVM) ధ్వంసం చేశారని, తనపై దాడి చేశారని బాధితుడు శేషగిరిరావు పేర్కొన్నారు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో ఈనెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.


పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే.. కౌంటింగ్ రోజు కూడా పాల్పడే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈవీఎం పగలకొట్టిన ఘటనపై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంను పగలకొట్టిన ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నా, సీసీటీవీ రికార్డు ఉన్నా... స్థానిక వీఆర్‌వో, ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారని పిర్యాదులో పేర్కొంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని అన్నారు.


హత్యాయత్నం, ఈవీఎం పగలకొట్టిన ఘటనలు రెండూ తీవ్రమైనవి అయినా... బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయని బాధితుడు శేషగిరిరావు తన పిటిషన్లలో పేర్కొంటూ వాపోయారు. ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున... భద్రత కల్పించాలని, రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, పిన్నెల్లి లేకపోయినా... ఆయన ఏజంట్ ద్వారా అయినా కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించే అవకాశం ఉందన్నారు. పిన్నెల్లి స్వయంగా... కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్ళీ హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు పేర్కొన్నారు.


నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉందని, పిన్నెల్లి బయట ఉంటే.. అది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు అన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటే ఆరోజు మాచర్ల అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత నెల 13న ఎన్నికల హింసకు పాల్పడిన ఆధారాలు స్పష్టంగా ఉన్నా... హైకోర్టు వాటిని పట్టించుకోకుండా... అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిందని పిటిషనర్ మరొకసారి విజ్ఞప్తి చేశారు. కాగా బాధితుడు శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సోమవారం (ఈనెల 3న) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హీట్ పెంచుతున్న ఆవిర్భావ వేడుకలు

టీడీపీ గెలుస్తుందంటూ.. వైసీపీ నేతల బెట్టింగ్..

దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం..

చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..

వాలంటీర్లను నిండా ముంచిన జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 01 , 2024 | 01:46 PM

Advertising
Advertising