ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati Works: అమరావతి పునఃనిర్మాణానికి సీఎం చంద్రబాబు ముందడుగు.. నేడే..

ABN, Publish Date - Oct 19 , 2024 | 07:54 AM

రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు.

అమరావతి: రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు. గత ఐదేళ్లపాటు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా వాటిని పట్టాలెక్కించి పరిస్థితిని పూర్తిగా మార్చనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఇవాళ (శనివారం) సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. రూ.160 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఈనెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల పునఃప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


ఈనెల 16న జరిగిన సీఆర్డీయే సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం దూసుకువెళ్తోంది. గత బుధవారం సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితి సహా మెుత్తం 12 అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. గతంలో భూమి పొందిన వారు, మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. ఎవరికి భూములు కేటాయించాలి, ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా అయ్యేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజధాని అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చేవారికి భూ కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. టాప్ 10 కాలేజీలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులు ఏర్పాటు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.


జీవో 207 ప్రకారం 8352 స్వేర్ కి.మీ. పరిధిలోనే రాజధాని అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే గతంలో గుర్తించిన విస్తీర్ణమే.. సీఆర్డీయే పరిధని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తేవాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ 5 జోన్‌పైనా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో తీసుకున్న చట్టవ్యతిరేక నిర్ణయాలపై లోతైన సమీక్ష జరపాలని అధికారులు సీఎంను కోరారు. దీనిపైనా త్వరలో చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో రూ.160 కోట్లతో 2,42,481 చదరపు అడుగుల్లో సీఆర్‌డీఏ కార్యాలయం నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేడు రాజధాని పనులు మెుదలు కానున్నాయి.

Updated Date - Oct 19 , 2024 | 08:20 AM