ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:55 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు.

గుంటూరు జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికు (YS Jagan) రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య హత్య జరిగినపుడు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్ ఢిల్లీలో కాదు గల్లీలో చేసిన అవినీతి బాగోతం అందరికీ తెలుసునని ఆక్షేపించారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారని ఆరోపణలు చేశారు. ఏపీని జగన్ ఆధోగతిపాలు చేశారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ జిమిక్కులు చేస్తున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు.


ALSO Read:CM Chandrababu: ఎంపీలతో చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక విషయాలివే..!

అసెంబ్లీ సమావేశాలకు రావొద్దని జగన్ డ్రామా: కొల్లు రవీంద్ర

ఎన్టీఆర్ జిల్లా: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ రాకుండా ఎగ్గొట్టేందుకు వినుకొండ ఘటనను అసరాగా చేసుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం వస్తుందని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జరిగిన ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పారు. వ్యక్తిగత తగాదాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మైండ్ ఉండి మాట్లాడుతున్నాడో.. మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్ ఓ గజినీలా మారిపోయారని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు.


జగన్ ఢిల్లీ ఎలా వెళ్తున్నారు..?: మంత్రి అనగాని

గుంటూరు: ఢిల్లీకి మాజీ సీఎం జగన్‌ ఏ మొఖం పెట్టుకుని వెళ్తున్నారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad) ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సవ్యంగా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ తప్పుడు మాటలు.. పిచ్చి కూతలకు ఎవ్వరూ భయపడరని అన్నారు. రౌడీయిజాన్ని అణిచివేసే పార్టీ టీడీపీనేనని స్పష్టం చేశారు. జగన్ పాలనలో హత్యలు.. ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు. జగన్ హయాంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను దారుణంగా హత్య చేసిన విషయం మరిచిపోయారా..? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ravi Kumar: ఏపీ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష..

Nimmala: చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 05:28 PM

Advertising
Advertising
<