ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద రౌడీ షీటర్ హత్య..

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:40 PM

జిల్లాలోని మసీదుపురం మెట్ట వద్ద రౌడీషీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వా సాయి అనే రౌడీ షీటర్‍ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో వేటాడి మరీ దారుణంగా హతమార్చారు.

నంద్యాల: జిల్లాలోని మసీదుపురం మెట్ట(Masidupuram Metta) వద్ద రౌడీషీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వా సాయి(Kavva Sai) అనే రౌడీ షీటర్‍ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో వేటాడి మరీ దారుణంగా హతమార్చారు. నంద్యాలలో 2022సంవత్సరంలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో కవ్వా సాయి ప్రధాన ముద్దాయి. కవ్వాసాయి మరో ముగ్గురితో కలిసి కానిస్టేబుల్‌ను వెంటాడి చంపారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం కేసులోనూ మృతుడు ముద్దాయిగా ఉన్నాడు. అయితే పాత గొడవల కారణంగానే కవ్వా సాయిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హతుడిని మరో గ్యాంగ్ సభ్యులు మసీదుపురంలోని ఓ వెంచర్ వద్ద వెంటాడి మరీ నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి:

Lok Sabha Session: 2027నాటికి దేశవ్యాప్తంగా 25వేల జన ఔషధి కేంద్రాలు..

Updated Date - Aug 02 , 2024 | 04:43 PM

Advertising
Advertising
<