మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Murali Mohan: ఏపీ బాగుండాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి

ABN, Publish Date - Mar 21 , 2024 | 05:44 PM

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దిక్కులేని విధంగా మారిందని తెలుగుదేశం (TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ (Murali Mohan) అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం నాడు ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్‌, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్‌ మీడియాతో మాట్లాడుతూ... 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధిలో వెనకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Murali Mohan: ఏపీ బాగుండాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి

హైదరాబాద్: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దిక్కులేని విధంగా మారిందని తెలుగుదేశం (TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ (Murali Mohan) అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం నాడు ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్‌, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్‌ మీడియాతో మాట్లాడుతూ... 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధిలో వెనకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Sharmila: కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక

ఐదేళ్లల్లో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో దోపిడీ పెరిగిపోయిందని మండిపడ్డారు. ఏపీ బాగుపడాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం.. అన్ని రంగాల్లో వెనకపడటానికి కారణం అయిందని అన్నారు. రాష్ట్ర బాగుకోసం మంచి నాయకుడైన చంద్రబాబుని సీఎంగా ఎన్నుకోవాలని చెప్పారు.ఉచితాలకు బదులు ఉపాధి మార్గం చూపితే ప్రజల జీవితం మెరుగుపడుతుందని అన్నారు. ఉచితాల వల్ల ప్రయోజనం ఉండదని మురళీమోహన్‌ అన్నారు.

Chintamaneni: ఏ ముఖం పెట్టుకుని జగన్ బస్సు యాత్ర అంటున్నారు?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 05:44 PM

Advertising
Advertising