ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఏ శాఖలోనూ నిధుల్లేవ్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 26 , 2024 | 06:27 PM

ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు.

నెల్లూరు: ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు. పండుగ కోసం వచ్చే భక్తులు కోసం అన్ని వసతులు కల్పించామన్నారు. ఈరోజు(బుధవారం) నెల్లూరులె పర్యటించారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ప్రతి ఏడాది భక్తులు పెరుగుతున్నారని చెప్పారు. విదేశాల నుంచి సైతం భక్తులు రొట్టెల పండుగకు వస్తారని అన్నారు. దర్గాలోని పనులను కొద్దిగా సమయం తీసుకొని పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్, వసతులు ఉండాలన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, రొట్టెల‌ పండుగకి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రూ.కోటీ 57 లక్షలకు టెండర్లు పాడినట్లు తెలిపారు. దర్గా అభివృద్ధికి ఈ నిధులు వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 06:27 PM

Advertising
Advertising