ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌‌కు సినిమా మొదలైనట్టేనా..?

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:39 AM

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో శనివారం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది.

అమరావతి/మాచర్ల టౌన్‌, జూన్‌ 15: పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై (Pinnelli Brothers) మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో శనివారం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది. ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేశారు. టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై దాడి చేశారు. ఆ మరుసటిరోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకు రోడ్లపై స్వైరవిహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు, వెసీపీ రౌడీమూకలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్స్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు సమాచార ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 08:09 AM

Advertising
Advertising