ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP vs YSRCP: కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..

ABN, Publish Date - Sep 26 , 2024 | 08:58 PM

‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ...

TDP MLA Venigandla Ramu vs Kodali Nani

అమరావతి, సెప్టెంబర్ 26: ‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రంగా స్పందించారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజలు స్వయంగా వారే ముందుకు వచ్చి చంద్రబాబు పాలనలో తామెంత సుభిక్షంగా ఉన్నామో చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.


కలియుగ ప్రత్యక్ష దైవమయిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తయారయ్యే లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగంచడం దారుణం అన్నారు. నాటి జగన్ రెడ్డి ఈ చర్యతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఈ దుర్మార్గం బయటపడగానే ఎక్కడినుంచి బయటికొచ్చారో తెలియదు.. వచ్చేశారంటూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. విజయవాడలో వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనబడని కొడాలి నాని.. ఇప్పుడు బయటికొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కష్టంతో తన సుపరిపాలనతో స్కై రాకెట్ అంత ప్రతిష్టను సంపాదించారని.. అధఃపాతాళంలో ఉన్న జగన్‌పై విష ప్రచారం చేయాల్సిన అవసరం ఆయనకు లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.


ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించిన బూతుల నేత కొడాలి నాని.. విశ్వాసం గురించి, దేవుడి గురించి మాట్లాడితే విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగ్గొట్టినప్పుడు బొమ్మే కదా ఏమవుతుందని అన్న విషయం మరిచిపోయావా? అని కొడాలి నానిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు చోరీకి గురైతే.. ఎంత ఖర్చవుతుందని మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి కొడాలి నానికి ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ‘నువ్వు గుర్తొస్తేనే, నీ మాటలు గుర్తొస్తేనే గుడివాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇకనైనా పిచ్చి వాగుడు మానకపోతే గుడివాడ ప్రజలు తరిమి తరిమి కొడతారు’ అంటూ కొడాలి నానికి ఎమ్మెల్యే రాము సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


Also Read:

తిరుపతిలో పోలీసుల ఆంక్షలు..

షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం..

విమానాన్ని ఈ పక్షులు ఎలా వాడుకున్నాయో చూస్తే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 26 , 2024 | 08:58 PM