ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

ABN, Publish Date - Jul 07 , 2024 | 03:58 AM

కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్‌గాం జిల్లా ఫ్రిసాల్‌ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...

శ్రీనగర్‌, జూలై 6: కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్‌గాం జిల్లా ఫ్రిసాల్‌ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు, ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలోని మోదెర్‌గాం గ్రామం వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను మరణించాడు.

చిన్నిగాం ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో గాయపడ్డ జవాను ఒకరు అనంతరం ప్రాణాలు కోల్పోయాడని అధికార వర్గాలు తెలిపాయి. మరో సంఘటనలో మోదెర్‌గాంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఆ ఇంటి చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - Jul 07 , 2024 | 03:58 AM

Advertising
Advertising
<