Share News

KL Rahul: ఆ ఫొటోలో అంత మీనింగ్ ఉందా?

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:14 PM

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో తొలి టెస్టులోనే దారుణ వైఫల్యం చెందిన ఈ బెంగళూరు ప్లేయర్ టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ ఫొటో ఒకటి నెట్టంట వైరలవుతోంది.

KL Rahul: ఆ ఫొటోలో అంత మీనింగ్ ఉందా?

ముంబై: న్యూజిలాండ్ తో మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. తొలి టెస్టులోనే దారుణ వైఫల్యం చెందిన ఈ బెంగళూరు ప్లేయర్ టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే ఇతడి కోసం మంచి మంచి ప్లేయర్లను

సైతం పక్కన పెట్టేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ ఫొటో ఒకటి నెట్టంట వైరలవుతోంది.


న్యూజిలాండ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ వంగి పిచ్ కి దండం పెట్టడం ఇందులో కనిపిస్తోంది. దీంతో ఇదే అతని చివరి టెస్టు మ్యాచ్ కానుందా? అందుకే అంత సెంటిమెంటల్ గా ఫీలయ్యాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ’ఇప్పటికైనా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్తాడని ఆశిస్తున్నాం‘ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో ఇందులో అంత అర్థం ఉందా అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.


ఇటీవల కివీస్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన ఈ క్రికెటర్.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 12 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. దీంతో రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:15 PM