ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

75 ఏళ్లు నిండినా.. మోదీనే ప్రధాని

ABN, Publish Date - May 12 , 2024 | 04:18 AM

‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్‌ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఈ మేరకు స్పందించారు.

  • రిటైర్‌ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు

  • ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటే.. రేవంత్‌-రాహుల్‌ ట్యాక్స్‌

  • గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

  • సర్జికల్‌ స్ట్రైక్స్‌ను సీఎం రేవంత్‌ ప్రశ్నిస్తున్నారు

  • నా ఫేక్‌ వీడియోతో ఆయన తప్పు చేశారు

  • పాలమూరు-రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే

  • కేజ్రీవాల్‌కు సుప్రీం క్లీన్‌చీట్‌ ఇవ్వలే: అమిత్‌ షా

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్‌ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఈ మేరకు స్పందించారు. మోదీ రిటైర్‌ అవుతారంటూ ఇండీ కూటమి సంతోషించాల్సిన అవసరమే లేదన్నారు. ‘‘మోదీ మూడో టర్మ్‌ కూడా పూర్తిస్థాయిలో సేవలందిస్తారు. ఆయనతోనే దేశం సుభిక్షంగా ఉంటుంది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలనేది మోదీ లక్ష్యం. కానీ, దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. శనివారం వికారాబాద్‌, వనపర్తి జిల్లా కేంద్రాల్లో జరిగిన బీజేపీ జనసభల్లో, హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు.


లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కుటిలనీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘రిజర్వేషన్లను తొలగిస్తామని నేను పేర్కొన్నట్లు వీడియోను ఎడిట్‌ చేశారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి తప్పుచేశారు. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌, ఇండీ కూటమి నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. అమెరికా, ఇజ్రాయెల్‌ తర్వాత సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన మూడో దేశం భారత్‌ మాత్రమే. అయితే.. భారత్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను మనవాళ్లే(రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) ప్రశ్నిస్తున్నారు. దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తే ఊరుకునేదిలేదు. శత్రువు భూభాగంలోకి చొచ్చుకువెళ్లి మరీ.. దాడులు చేస్తాం’’ అని స్పష్టం చేశారు.పాకిస్థాన్‌ వద్ద అణ్వాయుధాలుంటే భయపడాలా? అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు, 370వ అధికరణ రద్దు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ఇండీ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారని, రోహింగ్యాలను ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా అండుపడుతోందని దుయ్యబట్టారు.


రేవంత్‌-రాహుల్‌ ట్యాక్స్‌

‘‘సోనియాగాంధీ జన్మదినం రోజున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయితే.. సోనియా ఎన్నో పుట్టినరోజున ఆ హామీని నెరవేరుస్తారు? రైతులకు రూ 15వేల రైతు భరోసా, క్వింటా ధాన్యానికి రూ 500 బోనస్‌, మహిళలకు రూ.2,500 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు?’’ అని రేవంత్‌ను అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. హైకమాండ్‌కు ఇచ్చిన హామీ మేరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి, పంపిస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఒక్కటై.. రాష్ట్ర ప్రజలపై ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కూడా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే..! అయితే.. ఆర్‌ఆర్‌ అంటే ఏమిటో ఆయన వివరించలేదు. అమిత్‌షా మాత్రం ఆర్‌ఆర్‌ అంటే రేవంత్‌-రాహుల్‌ ట్యాక్స్‌ అని స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఏటీఎంలాగా మార్చుకుందని విమర్శించారు. కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి అవినీతి ప్రాజెక్టుగా మారిందన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు అమలవుతున్న 4ు రిజర్వేషన్లను రద్దుచేసే ధైర్యం ఉందా? అని సీఎంకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో తమకు 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రభుత్వాన్ని నడిపేది మజ్లిస్సేనని అన్నారు. ‘‘తెలంగాణ ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్‌లో ఉంది. ఈ పదేళ్లలో రూ.లక్షల కోట్ల మేర అప్పు చేశారు. ఆ నిధులన్నీ ఎక్కడికెళ్లాయి? ఏం చేశారు?’’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పనిచేస్తోందని ఆరోపించారు. కాగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదని, మద్యంతర బెయిల్‌ మాత్రమే ఇచ్చిందని అమిత్‌షా గుర్తుచేశారు. దీనిని కేజ్రీవాల్‌ మరోవిధంగా అనుకుంటే అది ఆయన అమాయకత్వమే అవుతుందన్నారు.


3 దశల్లోనే బీజేపీకి 190 సీట్లు

మూడు దశల ఎన్నికల్లో బీజేపీకి 190 సీట్లను ప్రజలు కట్టబెట్టారని, తెలంగాణలో పది కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఎన్డీయే 400సీట్లను గెలుచుకోవడం ఖాయమన్నారు. రూ.12లక్షల కోట్ల అవినీతి చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని.. మోదీ 23 ఏళ్లలో 25 పైసల అవినీతి కూడా చేయలేదన్నారు.

పదేళ్లలో రాష్ట్రానికి భారీగా నిధులిచ్చాం

రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ.. ఈ పదేళ్లలో ఆర్థికంగా వెనుకబాటుకు గురైందని, అయితే.. కేంద్రం భారీగా నిధులిచ్చిందని అమిత్‌షా వెల్లడించారు. గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు అందితే.. తెలంగాణకు రూ.63 వేల కోట్లిచ్చామన్నారు. ఈ పదేళ్లలో రూ.1.62 లక్షల కోట్లను జాతీయ రహదారుల నిర్మాణాలకు, రూ.32వేల కోట్లను రైల్వే ప్రాజెక్టులకు, రూ7వేల కోట్లను విమానాశ్రయాలకు కేటాయించామని గుర్తుచేశారు. రూ.900 కోట్లతో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డును కేటాయించామన్నారు. రూ.6,500 కోట్లతో రామగుండంలో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభిమచామని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎంని మించి తెలంగాణకు రూ.9వేలకోట్లు రుణం ఇచ్చినందుకు మోదీకి రేవంత్‌ ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఈ నిధులు రాంటే.. ఉద్యోగులకు జీతాలూ చెల్లించలేకపోయేవారన్నారు. తాము పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ పదేళ్లుగా ఉందని, రిజర్వేషన్లను తొలగించాలనుకుంటే ఎప్పుడో చేసేవారిమని వ్యాఖ్యానించారు. తమకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు.

Updated Date - May 12 , 2024 | 04:19 AM

Advertising
Advertising