ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:08 AM

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.

  • నేడు టీజీఐఐసీ చైర్మన్‌గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, బర్కత్‌పుర, చిక్కడపల్లి, కొడంగల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కనీస వేతన మండలి(మినిమమ్‌ వేజ్‌ బోర్డు) చైర్మన్‌గా జనక్‌ ప్రసాద్‌, తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా ఆర్‌.గురునాథ్‌ రెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌గా బెల్లయ్యనాయక్‌, దివ్యాంగుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ముత్తినేని వీరయ్య, ఆయిల్‌ సీడ్‌ గ్రోయర్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, తెలంగాణ ఆగ్రోస్‌ చైర్మన్‌గా కాసుల బాలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.


మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఆయా కార్యాలయాలకు వెళ్లి నూతన చైర్మన్లను అభినందించారు. ఇక, టీజీఐఐసీ చైర్మన్‌గా నియమితులైన నిర్మ లా జగ్గారెడ్డి, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నూతి శ్రీకాంత్‌గౌడ్‌, తెలంగాణ కోపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌గా మనాల మోహన్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 03:08 AM

Advertising
Advertising
<