ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:50 AM

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.

  • రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు.. 30,750 కొత్త ఉద్యోగాలు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం

  • ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి.. దక్షిణ కొరియాకు బయల్దేరిన సీఎం

  • అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశాం.. పెట్టుబడుల వెల్లువతో అపార ఉద్యోగావకాశాలు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. పది రోజుల ప్రణాళికలో భాగంగా ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఆదివారం దక్షిణ కొరియాకు పయనమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి.


రూ.31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 30,750 ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా వేదికగా సీఎం రేవంత్‌ తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా ప్రకటించడం, హైదరాబాద్‌లో నాలుగో నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన లభించింది. కాగా, అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు.


స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ నుంచి ఫ్యూచర్‌ సిటీ నిర్మించేందుకు తమ సర్కారు ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకురావడం శుభసూచకమని తెలిపారు. మరోవైపు అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.


రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని వేమోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు డ్రైవర్‌ రహిత కారు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కారులో సీఎం కొంత దూరం ప్రయాణించారు.


  • 50 మందిపైగా వ్యాపారవేత్తలతో సమావేశం

రేవంత్‌, శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్‌, రామకృష్ణారావు, టీజీఐఐసీ ఎండీ, సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికాకు బయల్దేరింది. ఏడు రోజుల్లో 50 మందిపైగా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, ఫార్మా-లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్తు వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలకా్ట్రనిక్‌ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి కంపెనీలు అసక్తి చూపించాయి.


కాగ్నిజెంట్‌, చార్లెస్‌ స్క్వాబ్‌, ఆర్సీసీఎం కార్నింగ్‌, అమెజాన్‌, జొయిటిస్‌, హెచ్‌సీఏ హెల్త్‌ కేర్‌, వివింట్‌ ఫార్మా, థర్మో ఫిసర్‌, ఆరమ్‌ ఈక్విటీ, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, మోనార్క్‌ ట్రాక్టర్‌ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ విస్తరణకు అమెజాన్‌ తీసుకున్న నిర్ణయం మైలురాయిగా నిలిచింది. సీఎం బృందం యాపిల్‌, గూగుల్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.

Updated Date - Aug 12 , 2024 | 07:03 AM

Advertising
Advertising
<