Share News

Kanaka Durga temple: విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:25 AM

విజయవాడ కనకదుర్గమ్మకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు.

Kanaka Durga temple: విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం

  • సమర్పించిన భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి

  • జాతర బోనాల ఉత్సవాల కమిటీ

చార్మినార్‌, విజయవాడ(వన్‌టౌన్‌), జూలై 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కనకదుర్గమ్మకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు


. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని ఈవో కార్యాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ చైర్మన్‌ గాజుల అంజయ్య చంద్రకళ దంపతులతో పాటు ఈవో కె.ఎ్‌స.రామారావు దంపతులు పాల్గొన్నారు. భారీ ఊరేగింపు, బాజా భజంత్రీల నడుమ పోతరాజుల నృత్యాలతో విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయానికి చేరుకున్న బంగారు బోనానికి వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 04:25 AM