Share News

Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:39 AM

మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కూలగొడుతున్న చోటకు సెక్యూరిటీ లేకుండా రావాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాలు విసిరారు.

Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

  • ఇద్దరం మూసీ పరీవాహక ప్రాంతాలకు వెళ్దాం

  • శెభాష్‌ రేవంత్‌ అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా

  • బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తా: ఈటల

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కూలగొడుతున్న చోటకు సెక్యూరిటీ లేకుండా రావాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాలు విసిరారు. శెభాష్‌ రేవంత్‌ రెడ్డి అని బాధితులు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాస్తానన్నారు.


కంటోన్మెంట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు, చెరువులు బాగుచేయటానికి తాము వ్యతిరేకం కాదన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎంత ఖర్చవుతుందో, ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 04 , 2024 | 04:39 AM