ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmal: కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:35 AM

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్‌ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం.. రోగుల ప్రాణం మీదకు వస్తోంది.

  • నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

  • ఐదు నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్‌ను

  • ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది

  • రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు

  • స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు

ఖానాపూర్‌, ఆగస్టు 9: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్‌ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం.. రోగుల ప్రాణం మీదకు వస్తోంది. తాజాగా నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. కడెం మండలం లింగాపూర్‌కు చెందిన అజారుద్దీన్‌ జ్వరంతో బాధపడుతూ ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. పరీక్షించిన వైద్యులు అతడికి సెలైన్‌ బాటిల్‌ను ఎక్కించాలని సిబ్బందికి సూచించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఓ బాటిల్‌ను తీసుకొచ్చిన సిబ్బంది.. అతడికి ఎక్కించడం ప్రారంభించారు.


కానీ, కాసేపటికే అజారుద్దీన్‌ మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన అతడి సోదరుడు ఆ బాటిల్‌ను పరిశీలించగా.. 2024 మార్చి నెల వరకే దాని కాలపరిమితి ఉన్నట్లు కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. దాన్ని తొలగించి మరొకటి పెట్టారు. ఈ ఘటనలో బాధిత యువకుడికి ఎటువంటి అపాయం కలగకపోయినా.. కొంత మేర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సిబ్బందిపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు పొక్కడంతో పలువురు విలేకరులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి టేబుల్‌ను పరిశీలించగా... కాలం చెల్లిన మరిన్ని ఇంజక్షన్లు దర్శనమిచ్చాయి.


వాస్తవానికి నిర్ణీత గడువుకు మూడు నెలల ముందే ఆయా మందులను ప్రత్యేకంగా ఒక బాక్స్‌లో వేసి, నెల రోజుల ముందు వరకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, ఖానాపూర్‌ ఆస్పత్రిలో అలాంటి నిబంధనలేమీ పాటిస్తున్న దాఖలాలు కనిపించలేదు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వంశీమాధవ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచిస్తామని చెప్పారు. పని భారం వల్ల మందులను తొలగించడంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తామన్నారు. గడువు ముగిసిన సెలైన్‌ బాటిల్‌ ఎక్కించిన అజారుద్దీన్‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Updated Date - Aug 10 , 2024 | 03:35 AM

Advertising
Advertising
<