ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadiyam Srihari: కేసీఆర్‌పై నమ్మకం లేకే కాంగ్రె్‌సలోకి వలసలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:01 AM

మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందు కు అందరు దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇ

  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూలై 11: మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందు కు అందరు దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నేతలు తప్పు తెలుసుకొని పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలని, నాయకులకు నమ్మకం కల్పించి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయ త్నం చేయాలని సూచించారు. లేకుంటే బీఆర్‌ఎస్‌కనుమరుగవడం ఖాయమన్నారు.


జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్‌ కుటుంబంపై కడియం విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, అవినీతి అంతా కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 12 , 2024 | 03:01 AM

Advertising
Advertising
<