Share News

Jeevan Reddy: కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:45 PM

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోసం బీజేపీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను కాపాడటం కోసమే సీబీఐను వాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ తప్పులు బయటపడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందన్నారు.

Jeevan Reddy: కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల, జనవరి 6: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కోసం బీజేపీ (BJP) రెస్క్యూ ఆపరేషన్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Congress MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను కాపాడటం కోసమే సీబీఐను (CBI) వాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ తప్పులు బయటపడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందన్నారు. కవిత కేసును కావాలనే తొక్కి పెట్టారన్నారు. బీజేపీ - కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తలను సీబీఐ చేతిలో పెట్టారన్నారు. కాళేశ్వరం ఒక డొల్ల ప్రాజెక్టు అని.. కాళేశ్వరంపై న్యాయ విచారణ తప్పదని స్పష్టం చేశారు. బీజేపీ - కేసీఆర్ విధానాలను మేథావులు, న్యాయ కోవిధులు గమనించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 03:46 PM