ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP- BRS: టీడీపీ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎవరంటే..

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‎లోని‎ చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్‎గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‎లోని‎ చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్‎గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్ అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరారు.

టీడీపీలో చేరుతాం.. తీగల కృష్ణారెడ్డి

చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు.


మల్లారెడ్డి టీడీపీలోకి వస్తారని ప్రచారం...

మరోవైపు.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మల్కాజ్‎గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తన ముఖ్య అనుచరులతో గతంలో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీలో చేరే విషయంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. తిరిగి సొంతగూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగానూ పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు మల్లారెడ్డి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబును మల్లారెడ్డి కలవడం హాట్ టాపిక్‎గా మారింది.


బీఆర్ఎస్ ఘోర ఓటమితో మారిన పరిస్థితులు..

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణపై పట్టు సాధించడానికి బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల్లోకి జంపింగ్‌ చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బీఆర్ఎస్‌కు బై.. బై చెప్పేసి పసుపు కండువా కప్పుకోనున్నారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఖాళీగా టీటీడీపీ అధ్యక్ష పదవి...

మల్లారెడ్డి సంస్థల చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో ఉన్న పరిచయాలతో ఆయన టీటీడీపీలోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Oct 07 , 2024 | 01:19 PM