ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: అమెరికాలో మరో యూనివర్సిటీతో సీఎం రేవంత్ ఒప్పందం

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:37 PM

తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. యూఎస్‌లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

హైదరాబాద్: తెలంగాణకు (Telangana) పెట్టుబడుల (investments) వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటన విజయవంతంగా (America tour success) కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటి వరకు మొత్తం 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి అమెరికా టూర్ సక్సెస్‌గా కొనసాగుతోంది. యూఎస్‌లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

తాజాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం నాడు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్‌లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి.


బయోడిజైన్ ఆవిష్కరణలు..

తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు.

ఈ సమావేశం అనంతరం రేవంత్ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎంకి లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రస్తావించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


హెల్త్ కేర్ రంగంలో నైపుణ్యాల కోసం..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... స్టాన్‌ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం రాష్ట్ర యువత భవితకు కొత్త బాటలు వేస్తుందని చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్‌ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవెలప్మెంట్‌లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు. స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో తెలంగాణలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Updated Date - Aug 10 , 2024 | 04:58 PM

Advertising
Advertising
<