ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mallu Ravi: ఏపీ భవన్ విభజన ఓ కొలిక్కి.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 17 , 2024 | 06:43 PM

ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయిందని.. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మణం ఉంటుందని చెప్పారు.

ఢిల్లీ: ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయిందని.. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మణం ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చుని ఏపీ భవన్ విభజనను కొలిక్కి తెచ్చారని అన్నారు. ఏపీ భవన్ విభజనకి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనకి ప్రాముఖ్యత ఉందని చెప్పారు. 100 రోజుల్లో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన పునరుద్ధరిస్తామని 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో సెక్యులర్ డెమోక్రటిక్ పాలన పునరుద్ధరించడం ముఖ్యమైన అంశమని చెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులను కలవడానికి ప్రజా భవన్, సచివాలయం తలుపులు తెరిచామని చెప్పారు.

ప్రజలకు సేవకులుగా ప్రభుత్వం ఉందన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ గాడిన పెట్టామని అన్నారు. 100 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు చూసి.. దేశంలో కేంద్రంలో తెలంగాణ మోడల్‌గా కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉందని.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఏం మాట్లాడుతున్నారో తెలిడం లేదన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. గుజరాత్ మోడల్ తెలంగాణకి కావాలని అడగలేదని.. ప్రభుత్వ విధానం నెంబర్ 1గా తెలంగాణలో ఉందని వివరించారు. అదనంగా నూతన రాష్ట్రానికి ఇచ్చే భూమి అంశాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.100 రోజుల పాలనకి కవిత అరెస్ట‌కి సంబంధం లేదని అన్నారు. కవిత లిక్కర్ స్కాంలో ఉందని ఏడాది క్రితమే బీజేపీ ఎంపీలు చెప్పారన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని ఇప్పుడే చెప్పలేమన్నారు. లిక్కర్ స్కాం పై కాంగ్రెస్ వివరాలు తెలుసుకుని తమ స్టాండ్ తెలుపుతామని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. తాము అడగడం లేదని.. వాళ్లే వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. చెడపకురా..చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉందని ఆరోపించారు.

తమ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారని.. వాళ్ల పార్టీనే ఇప్పుడు ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌లో చేరికలకు కారణం బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. బీఆర్ఎస్ 100 రోజుల్లో వంద తప్పులు మాట్లాడి వాళ్ల పార్టీ నేతలే పార్టీ విడేలా చేసుకున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్‌కి లోక్ సభ అభ్యర్థులు కూడా లేరని అన్నారు. పార్టీలో చేరడానికి, పోటీ చేయడానికి కూడా నేతలు లేరన్నారు. తాము గెలవకపోయినా పర్లేదని.. కాంగ్రెస్ గెలవొద్దని కవిత అరెస్ట్‌తో బీఆర్ఎస్ బీజేపీతో రాజకీయ డ్రామా ఆడిస్తుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఇవ్వలేదని.. ఇప్పుడు సచివాలయంలో 6 ఫ్లోర్‌లో సీఎం రేవంత్‌ని కేటాయించిన సమయంలో ప్రజలు కలవడానికి అనుమతి ఉందన్నారు.18 గంటల పాటు పనిచేస్తున్నాము కాబట్టే 100 రోజుల్లో చాల పనులు పూర్తి చేశామని మల్లు రవి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 06:43 PM

Advertising
Advertising